రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త.. గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్..!
ప్రస్తుతం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఎస్ఎస్ తమన్ ఈ సాంగ్ రికార్డింగ్ పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా శంకర్ గత సినిమాల తరహాలోనే సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను మేలవించి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే పోస్టర్లు మనకు స్పష్టం చేశాయి.
వినయ విధేయ రామ తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నవీన్ చంద్ర , ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాదులో వేగంగా జరుగుతున్నాయి . ప్రధాన తారాగణం పై శంకర్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు.. వచ్చే ఏడాది సెలవుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.