ఒకే పోస్టర్ ద్వారా రెండు సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ....!!
ఈ సీక్వెల్కు శపథం అనే టైటిల్ను ఖరారు చేశాడు. ఒకే పోస్టర్ ద్వారా వ్యూహం మరియు శపథం సినిమాల విడుదల తేదీలని అనౌన్స్చేశాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10 వ తేదీన, అలాగే వ్యూహం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న శపథం సినిమాను 2024 జనవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అసామాన్యుడిగా ఎదిగిన వైఎస్ జగన్ కథతో ఈ రెండు సినిమాల్ని తెరకెక్కించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ కుటుంబంలో జరిగిన పరిస్థితులను అలాగే అతడి పై పడ్డ క్రిమినల్ కేసులను వ్యూహం సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా జగన్ ఎలా విజయాన్ని సాధించాడన్నది శపథం సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.ఆర్జీవి తెరకెక్కిస్తున్న వ్యూహం మరియు శపథం సినిమాల్లో వైఎస్ జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటిస్తున్నాడు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నది.ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్కుమార్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా వ్యూహం సినిమా నుంచి విడుదల అయినరెండు టీజర్ లు ఎంతో ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తుందో చూడాలి..