"యూఎస్ఏ" లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీకి వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ తర్వాత ఈయన తెలుగు లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో ఫుల్ లెన్త్ హీరో పాత్రలో నటించాడు. ఇకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో నవీన్ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
 

ఇక ఆ తర్వాత ఈ నటుడు జాతి రత్నాలు అనే సినిమాలో హీరోగా నటించి ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇలా వరుసగా రెండు విజయాలను అందుకున్న నవీన్ తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అనుష్క హీరోయిన్ గా నటించగా ... మహేష్ బాబు పి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని వంశీ , ప్రమోద్ లు నిర్మించారు. ఇకపోతే సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ సినిమా "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ లను అందుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: