టీజర్: రొమాంటిక్ కామెడీతో అదరగొట్టేసిన రవితేజ..!

Divya
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలైనా విడుదల చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ముఖ్యంగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రవితేజ.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు. పైగా ఇటీవల వచ్చిన మాస్ జాతర సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. ఇందులో రవితేజకి జోడిగా డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ నటించారు.



సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి కాగా , ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేసారు. ఇది రొమాంటిక్ కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. వెన్నెల కిషోర్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు సార్ అని అడగగా? రవితేజ నేను రెండుసార్లు చెప్పలేను. అక్కడే చెబుతా విను అని చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆషికా రంగనాథ్ ఎంట్రీ యూత్ ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో మరింత గ్లామర్ గా కనిపిస్తోంది.


అటు డింపుల్ హయతి కూడా తన గ్లామర్ తో డైలాగులతో మరొకసారి ఆకట్టుకుంటోంది. మొత్తానికి రొమాంటిక్ కామెడీ యాంగిల్ లో ఈ సినిమా రాబోతోంది. ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో రవితేజ చేసే రొమాన్స్ ను కూడా చాలా కొత్తగా చూపించారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. అటు ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా సక్సెస్ కొడతారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: