రాంచరణ్ మూవీ కొత్త షెడ్యూల్డ్ స్టార్ట్ ఎపుడో తెలుసా...!!

murali krishna
గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్‌ ఛేంజర్‌. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్‌ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రాంచరణ్ 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే హీరోయిన్ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్‌ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
కొన్ని రోజులపాటు ప్లాన్ చేసిన గేమ్‌ ఛేంజర్‌ కొత్త షెడ్యూల్ వచ్చే వారంలో షురూ కానున్నట్టు తెలుస్తుంది.రాంచరణ్‌తోపాటు మిగతా స్టార్ క్యాస్ట్ తో వచ్చే టాకీ పార్ట్‌ను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ఫిక్సయినట్టు సమాచారం.

 ఈ షెడ్యూల్ గురించి శంకర్‌ టీం త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేయనుంది.మొత్తానికి వేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తూ.. అభిమానులకు వరుస ప్రమోషనల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు రాంచరణ్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నారు... అలాగే ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, సముద్రఖని, జయరాయ్‌, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. అలాగే సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ లో కొన్ని కీలక సన్నివేశాలను కొన్ని రోజుల క్రితం స్టంట్ మాస్టర్‌ అన్బరివ్‌ నేతృత్వంలో మైక్రోబాట్‌ కెమెరాతో యాక్షన్‌ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: