కొరటాలతో నాకేలాంటి గొడవలు లేవంటున్న బండ్ల గణేష్....!!
ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి, నిర్మాతగా ఫెయిల్ అవుతున్నామో అని డీలా పడిన బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రం ఇచ్చాడు. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో, బండ్ల గణేష్ ని రాత్రికి రాత్రి స్టార్ నిర్మాతని ఎలా చేసిందో మనమంతా చూసాము.ఈ సినిమా తర్వాత వరుసగా 'బాద్షా', 'ఇద్దరమ్మాయిలతో', 'నీ జతగా నేనుండాలి', 'గోవిందుడు అందరి వాడేలే' మరియు టెంపర్ వంటి చిత్రాలు చేసాడు. ఒక్కటి కూడా గబ్బర్ సింగ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు, అలా అని భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు కూడా ఏమి లేవు. టెంపర్ తర్వాత మళ్ళీ బండ్ల గణేష్ సినిమాలను నిర్మించలేదు. ఇదంతా పక్కన పెడితే ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది.అదేమిటంటే గతం లో రామ్ చరణ్ - కొరటాల శివ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా ప్రారంభం అయ్యింది.
అయితే కథ విషయం లో చాలా అనుమానాలు ఉండడం తో ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది. అయితే ఈ సినిమా ప్రారంభం కంటే ముందే బండ్ల గణేష్ కొరటాల శివ కి పాతిక లక్షల రూపాయిల అడ్వాన్స్ ఇచ్చాడట. కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక కొరటాల శివ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడం తో బండ్ల గణేష్ పెద్ద గొడవకి దిగాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది. ఈ ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ దానికి సమాధానం చెప్తూ 'కొరటాల తో నాకు ఎలాంటి గొడవలు లేవు.కానీ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ కోసం కొరటాల కి పాతిక లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. భవిష్యత్తులో నా సినిమా కచ్చితంగా చేస్తాడు' అంటూ చెప్పుకొచ్చాడు.