భగవంత్ కేసరి స్టోరీ లీక్.. అదే నిజమైతే సినిమా బ్లాక్ బస్టరే?

praveen
అఖండ, వీర సింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు వరకు అభిమానులు ఎప్పుడూ చూడని విధంగా బాలయ్యను చూపించబోతున్నా అంటూ ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పి అందరిలో అంచనాలను రెట్టింపు చేశాడు. ఇక ఈ సినిమాలో అటు బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.

 ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్స్ అభిమానులందరికీ కూడా పూనకాల తెప్పించాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలకృష్ణకు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. ఇక వీరి కుమార్తెగా యంగ్ సెన్సేషన్ శ్రీలీలా నటిస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వార్త ప్రకారం.. కాజల్ అగర్వాల్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందట. బాలయ్య, కాజల్ యుక్త వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటారని.. వీరి ప్రేమకు గుర్తుగా శ్రీలీలా జన్మిస్తుందట. ఇక తర్వాత ఓ ప్రమాదంలో కాజల్ చనిపోతుందట.

 ఆ తర్వాత బాలయ్య మరో పెళ్లి చేసుకోకుండా కూతురే సర్వస్వంగ భావించి శ్రీ లీలను ఎంతో ప్రేమగా  పెంచుకుంటాడట. అయితే కాజల్ ఇలా మధ్యలో చనిపోయే పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. నేనే రాజు నేనే మంత్రి, ఎవడు లాంటి సినిమాల్లో మధ్యలోనే కాజల్ పాత్ర చనిపోతుంది. ఇప్పుడు అదే తరహాలో పాత్ర చేస్తుందని అంటున్నారు. అయితే కాజల్ పాత్ర మధ్యలో చనిపోయిందంటే అటు సినిమా సూపర్ హిట్ అవుతుందని గతంలో సినిమాల విషయంలో కూడా  నిరూపితమైందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: