లాంగ్ గ్యాప్ తర్వాత జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు
సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు రోజుల్లోనే 400 కోట్లకు పైగా అనే వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది జైలర్ సినిమా. తమిళం తో పాటు తెలుగులో నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది జైలర్ సినిమా. ఇక ఈ
సినిమా తర్వాత జై
భీమ్ ఫేం టీజే జ్ఞానవెల్ దర్శకత్వంలో ఒక పాన్
ఇండియన్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు
సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో
బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ ఒక కీలక పాత్రలు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ
సినిమా రాబోతోంది. కాగా ఈ సినిమాలో
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అమితాబచ్చన్లతో సమానంగా ఒక యంగ్ క్యారెక్టర్ కోసం స్టార్
హీరో నాని నీ సంప్రదించారట చిత్ర బృందం. కానీ నెగిటివ్ షేడ్స్ తో క్యారెక్టర్ ఉండడంతో అమితాబచ్చన్ మరియు
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించడానికి
నాని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఇక
నాని వదులుకున్న ఈ ఆఫర్ శర్వానందును వరించినట్లుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ అమితాబచ్చన్ సినిమాల్లో కలిసి నటించే అవకాశం కావడంతో నెగిటివ్ షేడ్స్ పాత్ర అన్నది కూడా పట్టించుకోకుండా
ఈ పాన్
ఇండియా సినిమా చేయడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మెసేజ్ కు కమర్షియల్ హంగులను మేళవిస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నాడట. లైక ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది..!!