ఆ రెండు తప్పులే.. బోళాను దెబ్బ కొట్టి డిజాస్టర్ చేశాయా?
మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక ఒక వారం తిరిగేలోపే కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అవడంతో ఫ్లాప్ అని తేలిపోయింది. ఇక ఎంత నష్టం మిగులుతుంది అనే లెక్కలు కూడా బయ్యర్లను మరింత భయపెడుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక కొంతమంది సినీ విశేషకులు అసలు బోలాశంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అన్న విషయంపై చర్చించుకుంటున్నారు. అయితే ఒక రకంగా చిరంజీవి ఎంచుకున్న స్క్రిప్ట్ అండ్ స్టోరీ మంచిదే అయినా రెండు తప్పులు మాత్రం సినిమాపై ప్రభావం చూపించాయి అని భావిస్తున్నారట. ఒరిజినల్ వర్షన్ ఇప్పుడు తెలుగు రీమేక్ వెర్షన్ చూసిన ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదేనట.
వేదాళం ఒరిజినల్ వర్షన్ లో అజిత్ కు చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. పూర్తిగా డి గ్లామర్ లుక్ లో ఈ పాత్ర ఉంటుంది. అంతకుముందు ఆమె చేసిన పాత్రలు కూడా ఇలాంటివే. కానీ ఇక్కడ తెలుగుకు వచ్చేసరికి గ్లామర్ రోల్స్ చేస్తున్న కీర్తి సురేష్ ని తీసుకోవడంతో మనసులో ఆ పాత్ర పై ప్రేక్షకులకు సానుభూతి ఏర్పడలేదు. ఇక మేకప్ కాస్ట్యూమ్స్ రిచ్ గా ఉన్నాయి. ఇది కూడాప్రేక్షకులకు నచ్చలేదు. వేదాళంలో లక్ష్మీ తల్లిదండ్రులకు చూపు ఉండదు. సింపతి ఎమోషన్ పరంగా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ మన దగ్గర మురళీ శర్మ జంటకు రిచ్ క్యాస్టింగ్ పెట్టుకున్నారు. కట్టు బొట్టు అన్ని ఎగువ మధ్యతరగతి అనిపించేలాగే ఉన్నాయి. దీంతో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ రెండే భోళాశంకర్కు మైనస్ గా మారాయి. నలుగురు అనుభవం ఉన్న రచయితలు ఈ అంశాల మీద మరింత కాస్త సీరియస్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం.