ఆ హీరోయిన్ గురించి.. త్రివిక్రమ్ చెప్పిందే నిజమైందా?

praveen
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గుంటూరు కారం అనే ఒక డిఫరెంట్ టైటిల్ ని కూడా పెట్టేశాడు. అయితే అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అటు అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది.ఎందుకంటే ఈ సినిమా కోసం ముందుగా మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమా నుంచి తప్పు అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఇక సెకండ్ హీరోయిన్గా తీసుకున్న శ్రీలీలనే మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా పెట్టేసారు అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు శ్రీలీలా సెకండ్ హీరోయిన్ గానే ఉందని ఇక మరో హీరోయిన్ ను పూజ హెగ్డే పాత్రలో సెలెక్ట్ చేస్తారు అని చెప్పాలి. అయితే పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలోకి సెలక్ట్ చేశాడు అంటూ ఒక గాసిప్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

 చిత్ర యూనిట్ దీనిపై స్పందించకపోవడంతో ఈ రూమర్స్ నిజమే అని మహేష్ బాబు అభిమానులందరూ కూడా నమ్ముతున్నారు. అంతేకాదు గతంలో మీనాక్షి చౌదరి గురించి త్రివిక్రమ్ మాట్లాడిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. మీనాక్షి తొలి చిత్రం ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్ళాడు త్రివిక్రమ్. ఆ సమయంలో మాట్లాడుతూ మీనాక్షి త్వరలోనే బిజీ హీరోయిన్ అవుతుందని.. టాప్ పొజిషన్లో ఉంటుందని.. అప్పుడు తనకు డేట్స్ ఇవ్వాలంటూ త్రివిక్రమ్ కోరాడు. అప్పుడు సరదాగా అన్నమాట ఇప్పుడు నిజమే అయిందన్నది తెలుస్తుంది. చివరికి మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ నిజంగానే మీనాక్షిని డేట్స్ అడిగాడు అంటూ నేటిజన్స్ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: