రామ్ చరణ్ కూతురి బారసాల కు అదిరిపోయే బహుమతి ఇచ్చిన అంబానీ దంపతులు..!!

Divya
రామ్ చరణ్ ,ఉపాసన ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.. జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబం కూడా చాలా సంబరపడిపోతున్నారు. మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ హాస్పిటల్ బయట చాలా హడావిడి చేయడం జరిగింది. ఇక మెగా వారసురాలని ఎప్పుడెప్పుడు చూస్తామో తనకి ఏ పేరు పెడతారా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అయితే ఆల్రెడీ మెగా ప్రిన్సెస్ కు ఒక పేరు అనుకున్నట్లుగా ప్రెస్ మీట్ లో రాంచరణ్ తెలియజేయడం జరిగింది.


ఆ పేరుని పాప బారసాల రోజున తెలియజేయబోతున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.కానీ బారసాల ఈరోజే అన్నట్లుగా తెలుస్తోంది..మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక ఈరోజు చాలా ఘనంగా జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరగబోతోంది ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.. ఈ బారసాల రోజున ఇండియన్ కుబేరుడు అంబానీ దంపతులు రామ్ చరణ్ ,ఉపాసనలకు బంగారు ఉయ్యాల బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.


ఇదంతా ఇలా ఉంటే రామ్ చరణ్ ఉపాసన మెగా ప్రిన్సెస్ పేరుతో పాటు ఫేసును కూడా రీవిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కూతురి జాతకం కూడా అద్భుతంగా ఉందని చిరంజీవి తెలియజేయడం జరిగింది. ఈ పాప జాతకం వల్లే గత కొంతకాలంగా తమ ఇంట్లో కూడా అన్ని సంతోషకరమైన సంఘటనలు జరుగుతున్నాయని చిరంజీవి ఆనందిస్తూ తెలియజేయడం జరిగింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఏం చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కియార అద్వానీ నటిస్తోంది. ప్రముఖ ఆస్కార్ అవార్డు.. సంబంధించి తాజాగా ఓటింగ్ వేసే అవకాశాన్ని సంపాదించారు రామ్ చరణ్. ఇవే కాకుండా పలు చిత్రాలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: