పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత తనకు వచ్చిన క్రేజ్ మొత్తాన్ని కూడా చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పటి దాకా ఆయన బాహుబలి సిరీస్ తర్వాత మొత్తం మూడు సినిమాలు చేస్తే, ఆ మూడు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలతో డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన మూడు ఫ్లాప్ సినిమాలకు వచ్చిన నష్టాలను కనుక లెక్కవేస్తే అది కూడా ఖచ్చితంగా ఒక రికార్డుగా మిగిలిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఆ లెక్కలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బాహుబలి సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కావడం తో ‘సాహూ’ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ ప్రాంతాలకు కలిపి మొత్తం 290 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ ఫుల్ రన్ లో కేవలం 230 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది. అంటే అక్షరాలా 60 కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది.
ఇక ఆ మూవీ తర్వాత విడుదలైన రాధే శ్యామ్ సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం 210 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ ఫుల్ రన్ లో కేవలం 84 కోట్ల రూపాయిలు మాత్రమే ఈ సినిమా రాబట్టింది, అంటే అక్షరాలా 126 కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది. ఇక ఇండియా లో ఈ సినిమానే అతి పెద్ద నష్టం కలిగించిన సినిమాగా చెప్పుకొచ్చారు ట్రేడ్ పండితులు.ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా అదే లిస్టులోకి వెళ్లనుంది. ఇప్పటి దాకా ఈ సినిమాకి కేవలం 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి,బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా మరో 90 కోట్లు రాబట్టాలి. ఇక అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.అలా మూడు సినిమాలకు మొత్తం 276 కోట్ల రూపాయిలు నష్టపోయారని ఇంకా ఇది ఆల్ టైం రికార్డుగా చెప్పుకొస్తున్నారు ట్రేడ్ పండితులు.మొత్తానికి ఆది పురుష్ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ డిజాస్టర్ ని ఎదురుకున్నాడు.