తారక్, త్రివిక్రమ్ సినిమా అందుకే ఆగిపోయింది?

Purushottham Vinay
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యి వేర్వేరు కారణాల వల్ల అది ఆగిపోయింది.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి సంబంధించి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఎన్టీఆర్30 సినిమా వ్యయంలో కలపడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం తెలుస్తోంది.తన సినిమాల ద్వారా తన అన్న కళ్యాణ్ రామ్ కు కచ్చితంగా భారీగా లాభాలు రావాలని భావిస్తున్న ఎన్టీఆర్ (NTR) లాభం తగ్గిపోతుందని భావించి ఆ సినిమా నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన పార్టీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కావడంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో తారక్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం కూడా ఉందని సమాచారం తెలుస్తోంది.


 త్రివిక్రమ్ శ్రీనివాస్ మనస్సులో భారీ మైథలాజికల్ సినిమా ఉందని ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అకస్మాత్తుగా పార్టీ ఇవ్వడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ ఇండియాకు రావడంతో ఆయనను పార్టీకి పిలిచి తారక్ ఈ పార్టీ ఇచ్చారని సమాచారం తెలుస్తుంది.దర్శకులు, నిర్మాతలు ఈ పార్టీకి హాజరు కాగా తన ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా ఈ పార్టీకి హాజరై ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఈ పార్టీకి ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంకా సినిమాలు రావాలని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబినేషన్ లో ఇకపై సినిమాలు రావడం అంత ఈజీ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: