మహేష్ 28వ మూవీ విడుదలపై లేటెస్ట్ టాక్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వరుస విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట మూవీ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల , మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.

అలాగే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు అని ... దానితో ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అని ... అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా కాస్త సమయం ఎక్కువ పట్టే ఉద్దేశం ఉండటంతో ఈ మూవీ ఆగస్టు నెలలో విడుదల కాపడం కష్టమే అని ... దానితో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉంది అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చిత్ర బృందం విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మాత్రం ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: