ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన పునీత్ చివరి సినిమా?

Purushottham Vinay
కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్‌లో సడెన్ గా గుండెపోటుతో కన్నుమూశారు. అయితే పునీత్‌ చనిపోయేనాటికే ఆయన చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. దీంతో వాటి రిలీజులపై అప్పుడు సందిగ్ధం ఏర్పడింది.అయితే పునీత్‌పై అభిమానంతో దర్శక నిర్మాతలు ఎలాగోలా అన్ని సినిమాలు పూర్తి చేశారు. అలా పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశాక రిలీజైన జేమ్స్‌, లక్కీమ్యాన్‌ సినిమాలు కన్నడనాట సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈలోకంలో లేని తమ అభిమానం హీరో పునీత్‌ను సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసేందుకు ఆయన అభిమానులు ఎంతగానో పోటీపడ్డారు. ఇక పునీత్ చివరిగా నటించిన చిత్రం గంధడ గుడి. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిన ఈ సినిమాని వైల్డ్‌ లైఫ్‌ డాక్యుమెంటరీగా పునీత్ స్నేహితుడు అమోఘ వర్ష తెరకెక్కించారు. పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విన్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. గత సంవత్సరం పునీత్‌ వర్ధంతి (అక్టోబర్‌ 22) సందర్భంగా విడుదలైన గంధడ గుడి సినిమాకి ప్రేక్షకులు పోటెత్తారు.


ముఖ్యంగా పునీత్‌ను చివరిసారిగా సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసేందుకు ఆయన అభిమానులు పోటెత్తారు. అలాగే థియేటర్ల వద్ద పూజలు, పెద్ద ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. ఇక నిజ జీవితంలో కూడా స్వయానా ప్రకృతి ప్రేమికుడైన పునీత్‌ ఇందులో కూడా అదే పాత్రను పోషించారు. థియేటర్లలో మంచి విజయం సాధించిన గంధడ గుడి డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయింది.ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో గంధడ గుడి డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో పునీత్‌ కుమార్ జయంతి సందర్భంగా రేపు (మార్చి 17) నుంచి ఈ ను స్ట్రీమింగ్‌ చేయనుంది. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ల మాత్రం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు  ఓటీటీ సంస్థ.ఈ సినిమాలో కర్ణాటక రాష్ట్రంలోని అడవులు, అందమైన ప్రదేశాలను చాలా చక్కగా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: