త్రిష తెలుగు తెరకు దూరం కావడానికి కారణం ఎవరో తెలుసా..?

murali krishna
భాష అనే తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్. ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అందరూ అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది..అంతేకాదు చాలామంది త్రిష అందానికి ముగ్దులై తమ సినిమాల్లో వరుసగా అవకాశాలు అయితే ఇచ్చారు. ఇక ఈమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.అంతేకాదు త్రిష ఏ డ్రెస్ వేసినా కూడా అందుకు సెట్ అయ్యే ఫిజిక్ ఆమెకు ఉందని అందరికి తెలుసు.లంగా వోని వేసినా,చీర కట్టినా అలాగే మోడరన్ డ్రెస్ వేసినా ఆమెకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. త్రిష  తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో. ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వక పోయినప్పటికీ ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమా మాత్రం ఈమెకు తిరుగు లేని స్టార్డం తీసుకువచ్చి పెట్టింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో త్రిష పేరు మరింత పాపులర్ అయ్యింది. అంతేకాకుండా కృష్ణ మరియు అతడు వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా చేసింది..
అలా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వున్న త్రిష కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది..ఇక గత ఏడాది పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు అలరించింది. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీకి త్రిష దూరం అవడానికి ఓ స్టార్ హీరో తండ్రి కారణమని సమాచారం.. గతంలో త్రిష టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిందని తెలుస్తుంది.ఇక ఆ సంగతి కాస్త ఆ నిర్మాతకు తెలియడంతో త్రిష కు వార్నింగ్ కూడా ఇచ్చాడట.
అంతేకాదు సినిమాల్లో అవకాశాలు రాకుండా కూడా ఆ నిర్మాత చేయడంతో ప్రస్తుతం త్రిష తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది జరిగి నాలుగేళ్లకు పైగానే అవుతున్నప్పటికీ  ఇప్పటికి  త్రిష తెలుగులో మళ్లీ సినిమాలు మాత్రం చేయడం లేదు. అందుకే చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కాజల్ ప్లేస్ లో ముందుగా త్రిషకు అవకాశం వచ్చినా తిరస్కరించింది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: