త్రిష తెలుగు తెరకు దూరం కావడానికి కారణం ఎవరో తెలుసా..?
అలా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వున్న త్రిష కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది..ఇక గత ఏడాది పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు అలరించింది. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీకి త్రిష దూరం అవడానికి ఓ స్టార్ హీరో తండ్రి కారణమని సమాచారం.. గతంలో త్రిష టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిందని తెలుస్తుంది.ఇక ఆ సంగతి కాస్త ఆ నిర్మాతకు తెలియడంతో త్రిష కు వార్నింగ్ కూడా ఇచ్చాడట.
అంతేకాదు సినిమాల్లో అవకాశాలు రాకుండా కూడా ఆ నిర్మాత చేయడంతో ప్రస్తుతం త్రిష తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది జరిగి నాలుగేళ్లకు పైగానే అవుతున్నప్పటికీ ఇప్పటికి త్రిష తెలుగులో మళ్లీ సినిమాలు మాత్రం చేయడం లేదు. అందుకే చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కాజల్ ప్లేస్ లో ముందుగా త్రిషకు అవకాశం వచ్చినా తిరస్కరించింది అని సమాచారం.