రష్మిక మందన్న గురించి అందరికి తెలిసిందే.. పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం దక్షిణాది తో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా లు చేస్తోంది. కర్ణాటక లో పుట్టి పెరిగిన రష్మిక 2016 లో కిర్రిక్ పార్టీ అనే కన్నడ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అంజనీ పుత్ర లో నటించింది. గతేడాది చివరిలో గుండెపోటు తో మరణించిన దివంగత సూపర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రంలో హీరో. హర్ష దర్శకత్వం వహించిన ఈ విడుదలై నేటి కి ఐదేళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా అప్పు సార్ తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంది రష్మిక. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈరోజు తో అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్కుమార్ తో జరిగిన సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకం తో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నామనసు లో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమా లో అవకాశం కల్పించిన హర్ష సార్కు థాంక్యూ' అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది రష్మిక.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక మందన్నా ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రంలో నటిస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి నటించిన మిషన్ మజ్ఞు విడుదల కు సిద్ధంగా ఉంది. వీటితో పాటు విజయ్ సరసన వారసుడు, రణ్బీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోందీ కన్నడ బ్యూటీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో అమ్మడు ను బ్యాన్ చేసారని వార్తలు వినిపించాయి.. వాటిలో నిజం లేదని అమ్మడు చెప్పుకొచ్చింది..