ఆ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రభాస్... మారుతి మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెండవ షెడ్యూల్ ను మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ రెండవ షెడ్యూల్ ను డిసెంబర్ 8 వ తేదీ నుండి ప్రారంభించ బోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రభాస్ సరసన నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లను సెలెక్ట్  చేసుకున్నారు. అలాగే సంజయ్ దత్ కూడా ఈ మూవీ లో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే పేరును మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఒకే సెట్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం ఇప్పటికే ఒక మూత బడిన థియేటర్ ను చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు , ఆ థియేటర్ ను మార్పులు చేర్పులు చేసి ఇందు లోనే ఎక్కువ శాతం షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు మారుతి చాలా స్పీడ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని హర్రర్ కామెడీ నేపథ్యంలో మారుతి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: