పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్..
తన వీరోచితమైన పోరాట ప్రతిభ తో తెలుగు గడ్డ పై చెరగని ముద్రవేసిన “వీరమల్లు” పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకుని చాలా కాలం అయినప్పటికీ, పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. కాగా ఇటీవలే సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ ని కూడా నిర్వహించింది. ఈ నేపథ్యం లో భాగంగా పవన్ కొన్ని యాక్షన్ సన్ని వేశాల కోసం భారీగా కసరత్తు చేశాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయింది. కేవలం 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ పై కొన్ని యాక్షన్ అండ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినన్నారు. ఇందు కోసం ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించి నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి... ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...