తెలుగులోనే కాక.. దేశవ్యాప్తంగా ఇప్పుడు కార్తికేయ 2 చిత్రం దుమ్ము లేపుతుంది.ఇకపోతే ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సౌత్లోనే కాక.. బాలీవుడ్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్లను సైతం పక్కకు పెట్టి.. ఇక కార్తికేయ 2కు బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. అంతేకాదు భారీ వసూళ్లు చేస్తోంది ఈ సినిమా. అయితే ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ కార్తికేయ 2 సినిమా గురించి ప్రస్తావించారు.ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇకపోతే నిఖిల్, అనుపమ ఈ వీడియోని తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి..
తెగ సంబరపడిపోతున్నారు. ఆ వివరాలు..అయితే పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కార్తికేయ అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తోంది.ఇక. నిఖిల్ హీరో. నేను మార్పు రావాలని.. కోరుకుంటాను.అయితే ఇదే మార్పంటే.అంతేకాదు ఇది మాది అనుకోవడానికి లేదు. అందరూ రావాలి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక పవన్ మాట్లాడిన వీడియోని నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. సంతోషపడ్డారు.అంతేకాదు ఇంతకన్నా ఇంకేం కావాలి.. థాంక్స్ సర్ ఇది చాలా మాకు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఇక ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ 2 చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇకపోతే బాలీవుడ్లో కార్తికేయ 2 చిత్రం అనూహ్య రీతిలో కలెక్షన్ల వర్షం కనిపిస్తుంది. కాగా తొలి రోజు 50 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం 1500లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శితం అవతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా బాలీవుడ్లో 11 కోట్ల రూపాయలకు పైగా వసూళుల సాధించింది. కాగా తొలి రోజు కేవలం 7 లక్షల రూపాయలు వసూలు చేసిన చిత్రం.. పది రోజుల్లోనే 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇది ఇలానే కొనసాగితే.. అతి త్వరలోనే బాలీవుడ్లో 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!