మరొక స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. సక్సెస్ అయ్యేనా..?
బెంగళూరులోని శ్రీ రవి శంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ చిత్రం ప్రారంభమైనట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్.. తన ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా తరుణ్ సుధీర్ రచన దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఒకేసారి అన్ని భాషలలో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన మాలశ్రీ తనను ఆదరించినట్లుగానే తన కూతుర్ని కూడా ఆదరిస్తారని అందరు ప్రేమాభిమానాలు చూపిస్తారని రాథనా రామ్ కు శుభాకాంక్షలు తెలిపింది.
ఇక ఆమెకు మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలి అని రాక్ లైన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో తన కూతురు సిల్వర్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇస్తున్నదని తెలియజేసింది. చిన్న వయసు నుంచి తన కూతురు నది కావాలనుకుంటుంది ఇందుకోసం ముంబైలో ప్రత్యేకంగా నటన డాన్స్ శిక్షణలో కూడా నేర్పించాను సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని తన చాలా ఏళ్ల నుంచి కష్టపడుతుంది అని తెలియజేసింది. ఇక మాల శ్రీ భర్త రాము గత ఎడారి కరోనాతో మరణించారు. మరి ఈ ముద్దుగుమ్మ ఏ వేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.