ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

Divya
పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ పేరు పొందడంతో ప్రభాస్ నటిస్తున్న ప్రస్తుతం సినిమాలన్నీ ఎక్కువగా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరుగుతోంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా పైన భారీగానే అంచనాలు ఉన్నాయి.. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైరుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాల డిజాస్టర్ తో అభిమానులను కాస్త నిరాశపరిచిన ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో అన్ని లెక్కలను సరి చేస్తారని అభిమానులు సైతం చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు.

ప్రభాస్ ఈ సినిమాలో రాముడి గెటప్ లో కనిపించబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమా మేకోవర్ లీక్స్ ను బట్టి ఆదుపురుష్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది అన్నట్లుగా ఎక్కువగా ప్రచారం సాగుతోంది రామాయణంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ను మాత్రమే ఈ సినిమాలో డిజైన్ చేసినట్లుగా అందుకు తగ్గట్టుగానే విజువల్ గ్రాఫిక్స్ ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయినప్పటికీ ప్రస్తుతం నిర్మాణాంతర పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి గ్రాఫిక్స్ వర్క్ కోసం కొన్ని నెలలు సమయం కేటాయించవలసి వచ్చినట్లు సమాచారం.

ఇలా ప్రతి అంశం కూడా ఆదిపురుష్ సినిమా పైన మంచి బజ్ ను తీసుకువస్తుంది. కానీ ఇదే తరుణంలో విమర్శలు కూడా తెరపైకి కొన్ని వస్తూనే ఉన్నాయి. అయితే ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా పైన నిరుత్సాహంలో అభిమానులు ఉన్నట్లుగా తెలుస్తోంది అప్డేట్ ప్లీజ్ అంటూ కూడా డైరెక్టర్లకు చిత్రం బృందానికి విజ్ఞప్తి కూడా చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ బర్తడే రోజున డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా వచ్చేయడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది క్లారిటీ వస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: