ఆచార్యతో కొరటాల ఎన్ని కోట్లు నష్టపోయాడో తెలుసా?

Purushottham Vinay
కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు.ఇక తెలుగు చిత్ర సీమలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ..'ఆచార్య' సినిమాతో తొలి అపజయం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా మెగా పవర్ స్టార్ రామచరణ్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై పెద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.ఈ చిత్రం వలన కొరటాల శివ ఇమేజ్ చాలా డ్యామేజ్ అయిందనే చెప్పాలి.ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాని చూసి చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఈ మూవీ వలన డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టం వచ్చింది. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు దర్శకుడు కొరటాల శివ రూ.33 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. బయ్యర్లకు తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలోనే డైరెక్టర్ తన ఆస్తులు కూడా అమ్మేసుకున్నారట. అలా ఫెయిల్యూర్ బాధ్యత తీసుకుని మొత్తం రూ.15 కోట్ల వరకు ఆస్తులమ్మి చెల్లించినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.'



ఆచార్య' సినిమా రిలీజ్ కు ముందు రూ.120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ, సినిమా విడుదలయ్యాక డిస్ట్రిబ్యూటర్లకు పూడ్చలేనంత నష్టం మిగిల్చింది. సుమారుగా వారికి మొత్తం రూ.80 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు దర్శకుడు కొరటాల శివ ఇంకా హీరోలు కూడా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా డబ్బులు తిరిగి ఇచ్చారని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ నడుస్తుంది. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో NTR30 అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆచార్య సినిమాతో ప్లాప్ మూట గట్టుకున్న కొరటాల ఎన్టీఆర్ 30 సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఆచార్య సినిమా ప్లాప్ తరువాత ఎలా అయిన ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: