అయ్యో పాపం.. బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..

Satvika
నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈ మధ్య వచ్చిన అఖండ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు..ఆ సినిమా తర్వాత అసలు గ్యాప్ లేకుండా వరుస హిట్ సినిమా లలో నటిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే గెటప్‌లో మనకు కనిపించనున్నాడు..

సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ వీడియో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటంతో, ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది..బాలయ్య కరోనా నుండి పూర్తిగా కోలుకోవడంతో.. ఈ నెల 9 నుండి తిరిగి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. ఈ చిత్ర యూనిట్ సభ్యుల్లో మరికొందరికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్యతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న కొందరు సభ్యులకు కరోనా లక్షణాలు కనిపించాయని.. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పట్లో తిరిగి ప్రారంభించకూడదని చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ వార్థల్లొ నిజమేంత ఉంది అనే విషయం పై  క్లారిటీ రాలేదు. సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను అమెరికాలో షూట్ చేయాలని చూసిన చిత్ర యూనిట్‌కు వీసా సమస్యలు ఎదురవడంతో, నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను టర్కీకి షిఫ్ట్ చేశారు. మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: