ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న 'పక్కా కమర్షియల్' మూవీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న తెలుగు మూవీ లలో తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న మూవీ లలో పక్కా కమర్షియల్ మూవీ ఒకటి. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటిస్తుండగా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా రావు రమేష్ , సత్యరాజ్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు.  ఈ సినిమాని  యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు.  పక్కా కమర్షియల్ మూవీ ని జూలై 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా, వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం భారీ ఎత్తున నిర్వహించింది.

మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.  రెండవ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ ఏ ఏరియాలో ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుందో తెలుసుకుందాం.


నైజాం : 235 ప్లస్ , సీడెడ్ : 120 ప్లస్ , ఆంధ్ర : 270 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పక్కా కమర్షియల్ మూవీ 625 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.
రెస్ట్ ఆఫ్ ఇండియా లో 80 ప్లస్ , ఓవర్ సీస్ లో 250 ప్లస్ . మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ 955 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: