KGF2 ని ఫాలో అవుతున్న పుష్ప 2.. నిరాశలో ఫ్యాన్స్!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్స్ సినిమా సినిమాకు కూడా చాలా దారుణంగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుంటున్నారు.నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు.2020 వ సంవత్సరంలో అల వైకుంఠపురంలో మూవీ విడుదల చేశారు. ఇక పుష్ప సినిమా విడుదలకు మరో రెండేళ్ల సమయం తీసుకున్నాడు. కనీసం పుష్ప 2 సినిమా ఏడాది లోపే వస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న క్రమంలో ఈ ఏడాది చివరికల్లా కూడా విడుదల చేస్తారని భావించారు.అయితే ఇంత వరకు కూడా పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళలేదు. పుష్ప పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ముఖ్యంగా హిందీలో అయితే వంద కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ కూడా రెట్టింపు చేశారట. అలాగే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారట. హీరోయిన్ రష్మిక మందాన పాత్రను తగ్గించారని, పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి చనిపోతుందని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ పుకార్లను కూడా మేకర్స్ ఖండించారు.


ఇక తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా మరింత ఆలస్యం కానుందట. 2023లో కూడా పుష్ప విడుదలయ్యే సూచనలు లేవంటున్నారు. లేటైనా పకడ్బందీగా భారీ ఎత్తున చిత్రీకరించాలనేది ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఆలోచనట. కెజిఎఫ్ పార్ట్ 1 సినిమాతో పోల్చితే కెజిఎఫ్ 2 భారీ విజయం సాధించింది. ఆ మూవీపై ఉన్న హైప్ ఆ స్థాయి వసూళ్లకు ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాను అదే స్థాయిలో హిట్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. ఎటూ పుష్ప హిందీ బెల్ట్ లో మంచి హైప్ కూడా తెచ్చుకుంది.ఇక భారీగా చిత్రీకరించడం ద్వారా వందల కోట్ల వసూళ్లు సాధించడం సులభమె అని దర్శక నిర్మాతల ఆలోచన. ఆ క్రమంలోనే పుష్ప 2 సినిమా ఆలస్యం అవుతుంది. కనీసం వచ్చే ఏడాది పుష్ప 2 సినిమా వస్తుందని ఆశిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆలస్యం అయ్యేకొద్దీ చాలా నిరాశకు గురవుతున్నారు. ఇక పుష్ప పార్ట్ వన్ వరల్డ్ వైడ్ గా రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్ళు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: