కిచ్చ సుదీప్ 'విక్రాంత్ రోనా' ట్రైలర్ ఈవెంట్ కు విచ్చేయనున్న టాలీవుడ్ సెలబ్రిటీలు..!

Pulgam Srinivas
కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి , సైరా నరసింహారెడ్డి సినిమాలలో ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు.
 

అలాగే కిచ్చ సుదీప్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న కిచ్చ సుదీప్ తాను నటించిన మరో సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు. తాజాగా కిచ్చ సుదీప్ 'విక్రాంత్ రోనా' అనే అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనూప్ భండారి దర్శకత్వం వహించగా, జీ స్టూడియోస్‌ సమర్పణలో కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనివో ఫిలిమ్స్ ఇండియా బ్యానర్‌లపై శాలిని మంజునాథ్‌, జాక్‌ మంజునాథ్ ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో జాక్వలిన్ ఫెర్నాండెజ్ , నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ సినిమాకు బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భాషల ట్రైలర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమా 3డి వర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ప్రీమియర్ ఈవెంట్ ని ఈ రోజు ఉదయం 11 గం. లకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పివిఆర్ ఆర్కె సినీ మల్టిప్లెక్స్ స్క్రీన్ 2 లో విడుదల చేయనున్నారు. కాగా ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుండి క్రేజీ దర్శకుడు అయిన సురేందర్ రెడ్డి,  రామ్ గోపాల్ వర్మ, యంగ్ హీరో అక్కినేని అఖిల్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ అతిథులుగా రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: