ట్రైలర్: ఆహా లో మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్..!!
ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్ ఆర్కె మీడియా నిర్మించారు ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు ఇతర భాషల విడుదల చేయనున్నారు. తాజాగా ఇటీవల ఈ వెబ్ సిరీస్ టీజర్ ను కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ ను హైదరాబాదులో చాలా గ్రాండ్గా నిర్వహించారు.
ఇక ఈవెంట్స్ కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ని ముఖ్యఅతిథిగా తీసుకు రావడం జరిగింది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉన్నది. రెజీనా నివేదిత సతీష్ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా కనిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్క అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. మరి కొన్ని రోజుల క్రితం రెజీనా పలు ఐటమ్సాంగుల తో పాటు హీరోయిన్ గా నటించిన కూడా పెద్దగా కలిసి రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటించడంతో ఇమే కెరీర్కు ప్లస్ అవుతుందేమో చూడాలి.