షూటింగ్ టైంలోనే విపరీతమైన ఆలస్యం జరిగి వాయిదాల మీద వాయిదాలుతో ఫైనల్ గా ఈ నెల 17 వ తేదీన వస్తున్న విరాట పర్వం మీద ఉండాల్సినంత హైప్ ఇంకా రాలేదన్న లేదన్న మాట వాస్తవం అని చెప్పాలి.ప్రమోషన్లు మొదలుపెట్టినప్పటికీ కూడా సోషల్ మీడియాలో కనిపించాల్సిన హడావిడి అయితే మొదలుకాలేదు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా కూడా కదలిక తక్కువగా ఉంది.పోస్టర్లు లిరికల్ వీడియోలు అంటూ చిన్నగా స్టార్ట్ చేసినప్పటికీ కూడా చేతిలో ఇంకో రెండు వారాలు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అసలే ఇది నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఓ పీరియాడిక్ మూవీ. జనాలకు ఈ మధ్య ఈ కాన్సెప్ట్ అంటేనే అస్సలు ఎక్కడం లేదు. ఆచార్య సినిమాలో చిరంజీవి ఇంకా చరణ్ లు కలిసి చేసిన ఈ ఎపిసోడే పెద్ద మైనస్ అయ్యింది.ఇక కమర్షియల్ ఫ్లేవర్ అద్దితేనే అలా ఉంది. విరాట పర్వం థీమ్ కు కట్టుబడి నిజాయితీగా సాగే మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ సినిమా. ఇంత సీరియస్ ఇంటెన్స్ డ్రామాని సామాన్య ప్రేక్షకులు, ముఖ్యంగా మాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎన్నో ప్రశ్నలను రేపుతోంది.
దర్శకుడు వేణు ఊడుగుల చేసింది కేవలం ఒకే సినిమా. నీది నాది ఒకే కథ విమర్శకుల ప్రశంసలతో పాటు హిట్ స్టేటస్ అందుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయింది. కనీసం అందులో యూత్ ని ఆకట్టుకునే ఒక పాయింట్ అయినా ఉంది. కానీ విరాట పర్వం సినిమా మాత్రం చాలా సవాళ్ళను ఎదురుకోవాల్సి ఉంటుంది. డ్రైగా అనిపించే నక్సలిజం కాన్సెప్ట్ అందరూ కూడా కలిసి చూడొచ్చనేలా ప్రమోషన్ల వేగం పెంచాలి. ఇక ముఖ్యంగా రానా సాయిపల్లవిల కాంబినేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా తీసుకెళ్లగలిగితే ఓపెనింగ్స్ కి అంత ప్లస్ అవుతుంది.కానీ పరిస్థితి చూస్తుంటే సమస్యలు తప్పవని తెలుస్తుంది. దానికి బలమైన కారణం హీరో హీరోయిన్ల ఫామ్ అనే చెప్పాలి. ఇక రానా హీరోగా చేసిన ఏ ఒక్క సినిమా హిట్ కాలేదు. అలాగే సాయిపల్లవి కెరీర్లో లవ్ స్టోరీ, ఫిదా తప్ప ఏమీలేవు. ఈ అంశాలాన్ని చూస్తుంటే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యేలాగా వుంది.