ఇక దేశం గర్వించదగిన విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ నటించిన సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరైన్, చెంబన్ వినోద్ ఇంకా అలాగే కాళిదాస్ జయరామ్ లాంటి ప్రముఖులు నటించిన ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ప్రేక్షకులతోపాటు సినీ వర్గాల్లో కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రికార్డు స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కింది.ప్రతిష్టాత్మకంగా ఇంకా అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. తమిళనాడు థియేట్రికల్ హక్కులు మొత్తం 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డబ్బింగ్ రైట్స్ వచ్చేసి 6 కోట్ల రూపాయలకు ఇంకా కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5.50 కోట్ల రూపాయలు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక అలాగే కేరళ రాష్ట్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా చాలా భారీగానే జరిగింది. మలయాళ థియేట్రికల్ హక్కులు 4.25 కోట్లుకు ఇంకా అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 35 కోట్లకు ఇంకా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో థియేట్రికల్ పరంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 95.75 కోట్లుగా నమోదైంది.విక్రమ్ మూవీకి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, ఓటీటీ రైట్స్కు కూడా భారీ డిమాండ్ కనిపించింది. తమిళ, తెలుగు, మలయాళం ఇంకా కన్నడ సినిమాలకు సంబంధించిన హక్కులు 98 కోట్ల మేరకు అమ్ముడుపోయాయి. ఆడియో రైట్స్ 3 కోట్లకు ఇంకా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల మేర బిజినెస్ అనేది జరిగింది.ఇక అన్నీ కలుపుకోని మొత్తం 200 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిసినెస్ జరుపుకుంది. అంటే సినిమా హిట్ అవ్వాలంటే 200 కోట్ల పైన వసూళ్లు రావాలి.