టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ఇంకా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR)లు హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). పాన్ ఇండియా రేంజిలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ గా పేరున్న దానయ్య డివివి నిర్మించారు. అలాగే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైన్లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియాశరణ్, అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ దేవ్గణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే మార్చి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
కాగా నేటికీ కూడా థియేటర్లలో బాగా సందడి చేస్తోన్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ఓటీటీలో అడుగుపెట్టనుంది. రేపు (మే 20) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ ఇంకా అలాగే మలయాళ వెర్షన్స్లోఈ సినిమా ప్రసారం కానుంది.కాగా మొదట ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (టీవీవోడీ) పద్ధతిలో ఆర్ఆర్ఆర్ సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు జీ5 తెలిపింది. అంటే సబ్స్ర్కైబర్లు కూడా ఈ సినిమాని చూడాలంటే అదనంగా రూ. 100 చెల్లించాలి. అయితే ఈ నిర్ణయంపై సబ్స్ర్కైబర్లతో పాటు అభిమానుల నుంచి కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో దెబ్బకు జీ5 వెనక్కి తగ్గింది. సబ్ సబ్స్ర్కైబర్లందరికీ కూడా ఈ సినమాను ఉచితంగా చూసేలా వెసులు బాటుని కల్పించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా తాజాగా అధికారికంగా ప్రకటించింది.