టాలీవుడ్ విలక్షణ దర్శకుడు కృష్ణ వంశీ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కృష్ణవంశీ తన కెరియర్ లో కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వైవిధ్యమైన సినిమాలకు మాత్రమే మొదటి ప్రాముఖ్యతను ఇస్తూ తన కెరియర్ ను విజయవంతంగా ముందుకు సాగించాడు.
అలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ వంశీ ఈ మధ్యకాలంలో దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం పెద్ద విజయాలను అందుకోవడం లేదు. నిన్నే పెళ్లాడతా, అంతపురం, ఖడ్గం, సింధూరం వంటి పలు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణవంశీ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో దర్శకత్వం వహించిన మొగుడు, గోవిందుడు అందరివాడేలే , నక్షత్రం సినిమాలు వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్నాయి.
ఇలా వరుస అపజయా లతో బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయినా కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నట సామ్రాట్ అనే మరాఠీ మూవీ కి ఇది రీమేక్. రంగమార్తాండ మూవీ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా కృష్ణవంశీ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తాజాగా కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా... రంగమార్తాండ సినిమాకు సంబంధించిన లోగో తాజాగా పూర్తి అయ్యింది. రంగమార్తాండ మూవీ లోగో చాలా అద్భుతంగా వచ్చింది అన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.