'ఓటిటి' ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్..!

Pulgam Srinivas
హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా బాయ్స్ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్  'బాయ్స్'  సినిమాతో తమిళంలో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాయ్స్ మూవీ తో  టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సిద్ధార్థ్ కు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి అవకాశాలు దక్కాయి.  అందులో భాగంగా సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,  బొమ్మరిల్లు  సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో సిద్ధార్థ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు.

కాకపోతే ఆ తర్వాత కాలంలో సిద్ధార్థ్ అనేక సినిమాలలో నటించిన కానీ బాక్సాఫీసు దగ్గర మాత్రం విజయాలను దక్కించుకోవడంలో చాలా వరకు విఫలం అయ్యాడు.  అలా బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక అపజయాలను ఎదుర్కొన్న సిద్ధార్థ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.  మధ్యలో సిద్ధార్థ్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు.  కొంత కాలం క్రితం సిద్ధార్థ్  'మహా సముద్రం'  సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ హీరో కు  నిరాశనే  మిగిల్చింది.  

ఈ సినిమాలో సిద్ధార్థ్ తో పాటు శర్వానంద్ కూడా హీరోగా నటించాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా సిద్ధార్థ్  'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టనున్నాడు.  ప్రముఖ 'ఓ టి టి'  సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ స్పెషల్స్ నిర్మించిన 'ఎస్కేప్‌ లైవ్‌' వెబ్‌ సిరీస్‌ తో సిద్ధార్థ్ సందడి చేయనున్నాడు. సిద్ధార్థ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ కు సిద్ధార్థ్‌ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ మే 20 వ తేదీ నుండి డిస్లీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో   స్ట్రీమింగ్‌ కానుంది. మరి ఈ వెబ్ సిరీస్  ద్వారా సిద్ధార్థ్ ఎలాంటి గుర్తింపును సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: