బాలీవుడ్ లో మరో ప్రేమ జంట బ్రేక్ అప్ ?

VAMSI
మరో సెలబ్రిటీ ప్రేమ జంట విడిపోయింది అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటిదాకా చెట్టా పట్టాలేసుకుని ఊరంతా తిరిగిన ఈ ప్రేమ పక్షులు ఇగో ప్రాబ్లంతో ఇపుడు విడిపోయారని వార్తలు వినపడుతున్నాయి. ఇంతకీ వారెవరో కాదు బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియరా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా. గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న విషయం గట్టిగా వినపడుతోంది. ఇది నిజమే అంటూ బాలీవుడ్ మీడియాలు సైతం కోడై కోసాయి. ఓ వైపు డేటింగ్ చేస్తూనే... మరో వైపు "షెర్షా" అనే హిందీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించడం అలా వారి ప్రేమ మరింత బలపడటం జరిగింది అని ప్రచారం జరిగింది. అంతేకాదు వీరి ప్రేమ బంధాన్ని వివాహ బంధం గా మార్చుకోవాలని యోచిస్తున్నారు అని టాక్ కూడా వినిపించింది.
అయితే ఇపుడేమో వార్తలు తారుమారయ్యాయి. ఈ అందమైన లవ్ ట్రాక్ బ్రేక్ అప్ అయ్యింది అని సమాచారం. ప్రస్తుతం ఈ జంట విడిపోయింది అని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి ఓ కారణం ఉందని అంటున్నారు. వీరిద్దరికీ ఒక మూవీ ఆఫర్ రాగా అతడితో నేను నటించను అని కియారా చెప్పిందని దాంతో వీరి మద్య బ్రేకప్ జరిగిందన్న విషయం అర్థమవుతోంది అని వార్తలు వినపడుతున్నాయి. ఏవో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వలన ఈ జంట విడిపోయిందని అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
కియారా బ్రేకప్ వార్తలు నిజమే అని కొందరు సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు అని కూడా  టాక్ వినిపిస్తోంది.
కియరా అద్వానీ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను క్రేజీ ఆఫర్ లను అందుకుంటూ వరుస చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: