ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆ హీరో మళ్ళీ కనిపించాడబ్బా?

praveen
సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరో అవ్వాలని ప్రతి ఒక్కరు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇలా స్టార్ హీరోల ఎదిగితే మరికొంతమంది మాత్రం కొన్ని సినిమాల్లో ఒక వెలుగు వెలిగినా ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో కనుమరుగై పోతుంటారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా పోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోత్ కూడా ఒకరు అని చెప్పాలి. సిక్స్ టీన్స్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడూ రోహిత్. ఆ తర్వాత సొంతం అనే సినిమాతో మరో సినిమా చేశాడు.

 ఇక ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్, నేను మా సీతామహాలక్ష్మి అంటూ ఎన్నో సినిమాల్లో నటించిన హీరో రోహిత్ కి మాత్రం మంచి బ్రేక్ రాలేదు అని చెప్పాలి. మొదట హీరోగా నటించిన రోహిత్ ఆ తర్వాత మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమయ్యాడూ. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా  ఎం బి బి ఎస్ అనే సినిమాలో క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్ పాత్రలో నటిస్తాడు రోహిత్. అయితే ఇక ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేకపోవడంతో చిత్ర పరిశ్రమలో పూర్తిగా కనుమరుగై పోయాడు.


ఈ హీరో మళ్లీ సినిమా ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని రోహిత్ అభిమానులందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే చాలా రోజులు కాదు కాదు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక బుల్లితెర కార్యక్రమంలో ప్రత్యక్షమై పోయాడు.. ఏకంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రోమో లో భాగంగా ఇంద్రజ తో పాటు మరో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు హీరో రోహిత్. ఇక తనదైన శైలిలో అలరిస్తాడూ. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత రోహిత్ ని చూసిన అభిమానులు మురిసిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: