అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప, ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. అలాగే ఇప్పటికే పుష్ప సినిమా లోని పార్ట్ వన్ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఈ సినిమా అదిరిపోయే విజయం సాధించడంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది, ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా టీమ్ సెకండ్ పార్ట్ కు సంబంధించిన కథా చర్చలు చేయడానికి తమిళనాడు లోని 'కూనూర్' వెళ్లిందట, అక్కడి నుండి పుష్ప టీమ్ పూర్తి స్క్రిప్ట్ తోనే తిరిగి వస్తారట. జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ పార్ట్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారట, ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పుష్ప మూవీ కి 3 వ పార్ట్ కూడా చేయాలనే ఆలోచనతో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు, సెకండ్ పార్ట్ తరువాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత పుష్ప 3 చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ వన్ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కు ఏ రేంజ్ క్రేజ్ దక్కిందో మన అందరికీ తెలిసిందే, అయితే పుష్ప 2 లో కూడా స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది, ఆ స్పెషల్ సాంగ్ లో దిశా పటాని నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.