వైరల్ : త్రిబుల్ ఆర్ సినిమా చూస్తూ.. ఉపాసన హంగామా?

praveen
ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో.. టాలీవుడ్ లోని స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు హీరోలతో.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రకటన విడుదల అయిన నాటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూసారు.కానీ కరోనా వైరస్ కారణంగా ఇక ఈ సినిమాకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి.  చివరికి మూడున్నర సంవత్సరాల తర్వాత నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది త్రిబుల్ ఆర్ సినిమా.


 ఈ క్రమంలో ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు బారులుతీరారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా కనీసం టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా చాన్స్ లేని పరిస్థితి ఏర్పడింది. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం థియేటర్లకు వెళ్లి త్రిబుల్ ఆర్ సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా త్రిబుల్ ఆర్ సినిమా చూస్తూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం థియేటర్ లో తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఇలా ఉపాసన ఎంజాయ్ చేసిన వీడియో క్లాస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.


 ఇటీవలే భ్రమరాంబ థియేటర్ లో చిత్ర యూనిట్ తో కలిసి రామ్ చరణ్ ఉపాసన సినిమా చూసారూ. ఇక ఇలా సినిమా చూస్తున్న సమయంలో మధ్య మధ్యలో ఉపాసన ఏకంగా పేపర్లు చించి పైకి విసిరేస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఇక ఉపాసన రామ్ చరణ్ వచ్చారు అన్న విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా థియేటర్ వద్దకు బారులు తీరారు. ఇక భారీగా థియేటర్ వద్ద కు తరలి వచ్చిన అభిమానులు మధ్య నుంచి వెళ్లడం మాత్రం రామ్ చరణ్ కు కాస్త ఇబ్బందికరంగా మారిపోయిందని చెప్పాలీ. ఇక ఇలా త్రిబుల్ ఆర్ సినిమా చూస్తూ ఉపాసన ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో మాత్రం ఒంటరిగా వైరల్ గా మారి పోయింది. ఇక మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: