పక్కా కమర్షియల్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్...!!

murali krishna
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న సినిమా'రాధే శ్యామ్' చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకి టాక్ బాగానే వచ్చినా కానీ బెనిఫిట్ షోలు చూసిన జనాలు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో దానినే చివరికి ఫైనల్ చేసేసారు చాలా మంది జనాలు.

టాలీవుడ్ చరిత్రలో ఇది ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయం అని కూడా ట్రేడ్ పండితులు సైతం తేల్చేసారు. ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశాలు కూడా అస్సలు కనిపించడం లేదు.


'బాహుబలి' క్రేజ్ తో 'సాహో'కి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయట.. ఆ సినిమా మేకర్స్ ప్రాఫిట్స్ అయితే అందుకున్నారు, హిందీ బయ్యర్స్ కూడా సేఫ్ అయ్యారని తెలుస్తుంది.. ఇప్పుడు 'రాధే శ్యామ్' యావరేజ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరే అని తెలుస్తుంది.ఇప్పుడు ప్రభాస్ కు అర్జెంట్ గా ఓ హిట్టు అయితే కావాలి. 'ఆదిపురుష్' 'సలార్' చిత్రాలు ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశం అస్సలు లేదు. మారుతీ మాత్రం బౌండ్ స్క్రిప్ట్ తో ఎప్పటినుంచో రెడీగా ఉన్నాడు.

 

కానీ అతనికి స్టార్ హీరోలని మేనేజ్ చేసిన అనుభవం అస్సలు లేదు. 'బాబు బంగారం' అవకాశాన్ని కూడా మారుతీ సరిగా సద్వినియోగపరుచుకోలేకపోయాడు. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం మారుతీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మారుతీ-గోపీచంద్ కాంబినేషన్లో రాబోయే 'పక్కా కమర్షియల్' కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ ను గట్టిగానే దట్టించాడట మన మారుతీ. అల్లు అర్జున్ మరియు రవితేజ ల కోసం డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్ అని తెలుస్తుంది.

 

ఈ మూవీ కనుక హిట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ. అలాగే ప్రభాస్ తో మారుతీ చేసే సినిమా పై కూడా మంచి బజ్ ఏర్పడుతుందని తెలుస్తుంది.. తక్కువ బడ్జెట్ మరియు తక్కువ వర్కింగ్ డేస్ లో సినిమా పూర్తవుతుంది కాబట్టి.. ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: