రెండ్రోజుల్లో 50 కోట్ల మార్క్.. శభాష్ భీమ్లా నాయకా..!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన రీమేక్ సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా 'సితార ఎంటెర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది.ఇక టాలీవుడ్ సీనియర్ రైటర్ కం స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రియమైన మిత్రుడైనా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సూపర్ హిట్ సినిమాకి సంభాషణలు ఇంకా అలాగే స్క్రీన్ ప్లే ను అందించడంతో పాటు కథలో కూడా అనేక మార్పులు అనేవి చేయడం అనేది కూడా జరిగింది. ఫిబ్రవరి 25 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇక మొదటి షోతోనే మంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం అనేది జరిగింది.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో  భీమ్లా నాయక్ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండీ ఎన్నో అవంతరాలు ఎదురైనా రికార్డు కలెక్షన్లను రాబట్టడం అనేది విశేషం.


ఇక ఈ సినిమా  2 రోజుల కలెక్షన్లను కనుక ఒకసారి గమనిస్తే..'భీమ్లా నాయక్' సినిమాకి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది.ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను ఖచ్చితంగా రాబట్టాలి. రెండు రోజుల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ.52.04 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.57.96 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక ఈరోజుతో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం.రెండో రోజు ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది కానీ మొదటి రోజుతో పోలిస్తే ఎక్కువ డ్రాప్స్ అనేవి కనిపించాయి. ఈరోజు ఆదివారం రోజున కూడా బుకింగ్స్ బాగున్నాయి. మరి ఈ రోజు ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: