మహాభారతంలోని నటుడు కన్నుమూత..!!

Divya
బాలీవుడ్ లో ప్రముఖ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ మరణించినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున సాయంత్రం వేళ గుండెపోటుతో మరణించారట. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఆర్.బి చోప్రా రూపొందించిన మహాభారతంలోని.. భీముడు పాత్రలో ప్రవీణ్ బాగా పాపులర్ అయ్యాడు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, టీవీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

దాదాపుగా 20 సంవత్సరాలపాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాగా యాక్టివ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ సోబ్తీ 50కిపైగా హిందీ సినిమాలలో నటించి పలు సీరియల్స్ లో కూడా నటించారు. మహాభారత్ సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఇక ఇందులో భీముడు పాత్రలో ప్రాణం పోసి నటించాడు ఈ ప్రవీణ్ కుమార్. బాలీవుడ్లో "రక్ష" మూవీ ద్వారా తొలిసారిగా నటన రంగం వైపు అడుగు పెట్టాడు. ఆ తర్వాత జగీర్, జబర్దస్త్, మహా శక్తిమాన్, అగ్ని, కాళీ గంగా వంటి సినిమాలే కాకుండా ఇతర సినిమాల్లో సైతం నటించి మెప్పించాడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ. తెలుగులో కూడా ఒక మూవీ లో నటించాడు.. ఆ సినిమానే కిష్కిందకాండ. ఈ సినిమాలో ఒక ట్రక్కు డ్రైవర్ గా నటించి మెప్పించాడు. ఇక నటుడిగానే కాకుండా ఒక స్పోర్ట్స్ ఛాంపియన్ గా కూడా సత్తా చాటించాడు.


ఇండియన్ హమ్మర్ , డిస్కస్ ద్రోవర్ వీటితో పాటు రాజకీయాలలోని బాగా పేరు పొందాడు. ఇక అంతే కాకుండా బిఎస్ఎఫ్ లో కూడా జవాన్ గా పని చేయడం జరిగింది. 20 సంవత్సరాల వయసులో ఆర్మీలో జాయిన్ అయ్యి.. సరిహద్దు కాపలాగా ఉన్నారు ప్రవీణ్ కుమార్ సోబ్తీ. అయితే ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ క్రీడా లక్షణాలు గమనించిన ఆర్మీ అధికారులు బాగా ఎంకరేజ్ చేయడం జరిగిందట. ఇక ఆ తర్వాత డిస్కస్ ద్రోల్ వంటి ఏషియన్ గేమ్ లో పాల్గొన్నారు..ఇక అక్కడే రెండు గోల్డ్ మెడల్స్ కూడా సంపాదించాడు. ఇక ఆ తర్వాత ఒలంపిక్ గేమ్స్ లో పాల్గొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: