మన హీరోయిన్ల కోసం ఏమైనా చేస్తామంటున్నారు

NAGARJUNA NAKKA
దక్షిణాది హీరోయిన్స్‌కి బాలీవుడ్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. రేఖ, శ్రీదేవి నుంచి మొదలుపెడితే దీపిక పదుకొణే వరకు చాలామంది సౌత్‌ హీరోయిన్లు బాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ని అందుకున్నారు. వీళ్ల రూట్‌లోనే ఇప్పుడు చాలామంది సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న రష్మిక మందన్న హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది రష్మిక. ఇక ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' సినిమాకి సైన్ చేసింది. వీటితో పాటు మరో ప్రాజెక్ట్‌ కూడా లైన్‌లో ఉందని చెప్పింది రష్మిక.

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్‌ ఉన్న నయనతార 17 ఏళ్ల కెరీర్‌లో బాలీవుడ్‌ నుంచి ఎన్ని ఆఫర్స్‌ వచ్చినా ముంబయి వెళ్లలేదు. తెలుగు, తమిళ్, మళయాళీ సినిమాలతోనే బిజీ అయింది. కానీ ఆమెకి 'రాజారాణి'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ బేస్‌ వేసిన అట్లీ అడగ్గానే హిందీకి వెళ్లడానికి ఓకే చెప్పింది. అట్లీ బాలీవుడ్‌ ఫస్ట్‌ మూవీకి సైన్ చేసింది. ఈ మూవీలో షారుక్‌ ఖాన్‌ జోడీగా నటిస్తోంది నయన్.

అమలాపాల్‌ డివోర్స్‌ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌తో మళ్లీ బిజీ కావాలని చాలా ట్రై చేస్తోంది. 'ఆమె' లాంటి సినిమాల్లో బోల్డ్‌ రోల్స్‌ ప్లే చేసింది. అయితే అమలాకి మాత్రం సరైన బ్రేక్‌ రాలేదు. ఇలాంటి టైమ్‌లో 'రంజిష్‌ హీ సహీ' అనే సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లింది. ఈమూవీలో ఒకప్పటి హీరోయిన్ పర్వీన్‌ బాబీ క్యారెక్టర్ ప్లే చేసింది. రెండేళ్ల క్రితమే అమలాపాల్‌ హిందీలో అర్జున్‌ రామ్‌పాల్‌తో ఒక మూవీకి సైన్ చేసింది. కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు. మొత్తానికి మన హీరోయిన్లకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.కొత్త అందాలను వెండితెరపై చూపించేందుకు అక్కడి వారు ఆసక్తి చూపిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: