హమ్మయ్య.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్.. ట్రిపుల్ ఆర్ కంటే ముందే?

praveen
కరోనా వైరస్ కారణంగా పెద్ద సినిమాలకు గడ్డు పరిస్థితి  ఏర్పడింది. సినిమా షూటింగ్ లే అతికష్టం మీద జరిగగా.. ఇక విడుదల కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే సినిమాలను విడుదల చేయాల్సిన పరిస్థితి. కాదు కూడదు అని విడుదల చేస్తే చివరికి కష్టాలు తప్పవు. అందుకే రాధేశ్యామ్, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు ఇప్పటికే ఎన్నో సార్లు విడుదల వాయిదా పడింది. జనవరి  7వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించారు త్రిబుల్ ఆర్ బృందం. ఆ తర్వాత రాధేశ్యామ్ విడుదల అవుతుందని అనుకున్నారు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాల మేనియా ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులు భావించారు.


 కానీ అంతలో కరోనా వైరస్ కాలు అడ్డు పెట్టినంత పని చేసింది. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడవడం మొదలయ్యాయి. దీంతో మొదట త్రిబుల్ ఆర్ తర్వాత రాధేశ్యామ్ కూడా విడుదల కూడా వాయిదా వేసారూ. ఇక ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో అన్న దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇకపోతే ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేస్తాం అంటూ ప్రకటించింది చిత్ర బృందం. హామ్మయ్య ఇప్పటికి రిలీజ్ డేట్ వచ్చింది.. ఇక రాధేశ్యాం పరిస్థితి ఏంటో అంటూ అందరూ అనుకుంటున్న సమయంలో త్రిబుల్ ఆర్ కంటే ముందే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది రాధేశ్యామ్.


 మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము అంటూ ఇటీవల అఫీషియల్ ప్రకటన చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా కోసం నిరీక్షణ ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత రాధేశ్యామ్ విడుదలవుతుందని కొంత మంది అనుకున్నారు. కానీ  డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ముందుగానే  మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. వెంట వెంటనే విడుదల అవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో ఏదీ సక్సెస్ అవుతుందనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: