పుష్ప : ఓటిటి అయినా వసూళ్లు మాత్రం తగ్గేదేలే..

Purushottham Vinay
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ 'పుష్ప ది రైజ్' పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయ్యింది. 'ముత్తంశెట్టి మీడియా' సంస్థతో కలిసి 'మైత్రి మూవీ మేకర్స్' వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ..టాక్ తో ఎలాంటి సంబంధం లేకుండా భారీ వసూళ్ళనే రాబట్టింది ఈ సినిమా.తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ కూడా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది 'పుష్ప' సినిమా..

ఓటిటిలో విడుదల అయినప్పటికీ ఇప్పటికీ కూడా కలెక్షన్లలో ఎక్కువ శాతం డ్రాప్స్ అనేవి కనిపించలేదు.ఇక 'పుష్ప ది రైజ్' సినిమాకి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.22 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.153.31 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.7.31 కోట్ల లాభాలను అందించింది కానీ ఆంధ్రలో మాత్రం బయ్యర్స్ చాలా భారీగా నష్టపోయారు.వాళ్ళకి ఎంత నష్టమొచ్చిందో అంతా తిరిగి చెల్లించబోతున్నట్టు నిర్మాతలు కూడా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఓటిటిలో విడుదల అయినప్పటికీ 'పుష్ప' సినిమా ఇంకా మంచి కలెక్షన్లను నమోదు చేస్తుండడం విశేషం.ఇక మళ్ళీ వసూళ్లు రావడంతో డైరెక్టర్ సుకుమార్ సెకండ్ పార్ట్ పై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడు. ఈసారి ఎలాగైన అందరిని మెప్పించాలని చూస్తున్నాడు. ఇక చూడాలి పుష్ప పార్ట్ 2 తో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: