
ఇప్పుడే మూసుకుంటే మీ కర్మ అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తున్న ఆర్జీవీ ట్వీట్ వైరల్..!
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది.. ఇక ఆయన తన ట్విట్టర్ ద్వారా ఏం ట్వీట్ చేశాడు అనే విషయానికి వస్తే.. ఇప్పుడే నోళ్లు మూసుకుంటే.. ఇంకెప్పటికీ నోళ్ళు తెరవలేరు.. తర్వాత మీ కర్మ.. కాబట్టి టికెట్ రేట్ల విషయంలో మీరు మీ మనసులో ఏమనుకుంటున్నాతో ఆ నిజ భావాలను బయటపెట్టాలి.. సినీ పరిశ్రమలో ఉండే నా సహోద్యోగులు అందరికీ నేను చేసేది విన్నపం కాదు వార్నింగ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక టికెట్ రేట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ధోరణితో మాట్లాడుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తో ఢీ కొట్టాలి అంటే సినీ తారల అంతా ఒకే మాటపై ఏకతాటి మీద నడవాలి అంటూ ఆయన సినీ ఇండస్ట్రీలో ఉంటే ప్రముఖులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ఇకపోతే అన్ని అడాల్ట్ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత నిస్తున్న ఈయన ప్రస్తుతం తన దారిని మార్చుకుని మాస్ హీరోలతో సినిమా చేయడానికి కథను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు త్వరలోనే శివ దర్శకుడిని మళ్ళీ చూస్తారు అంటూ కూడా ఈయన చెప్పడంతో ప్రస్తుతం ఆయన అభిమానులంతా మరొక సెన్సేషనల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.