ఆర్. ఆర్. ఆర్ : స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమంటారా... మీడియాపై సెటైర్ వేసిన రాజమౌళి..!

murali krishna
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం 'రౌద్రం రణం రుధిరం' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా మరియు నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయని తెలుస్తుంది.పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్ మరియు కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని సమాచారం.


ఈ మూవీలో తారక్ కొమరం భీమ్గా కనిపించనుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారని తెలుస్తుంది.కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారట. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్కు చేరుకుని ప్రభంజనం సృష్టించిందని తెలుస్తుంది.

ముంబయిలో ఇటీవలే మీడియాతో ముచ్చటించిన రాజమౌళి అండ్ టీమ్ తాజాగా హైదరాబాద్లోనూ మీడియాతో సమావేశమయ్యారని తెలుస్తుంది.. ఇందులో రామ్చరణ్ మరియు తారక్ కూాడా హాజరయ్యారని తెలుస్తుంది.ఈ సందర్భంగా సినిమాలో తారక్ మరియు రామ్చరణ్ పాత్రలతో పాటు అజవ్ దేవగణ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పి పంచులు వేశారట రాజమౌళి.

ఇందులో అజయ్ దేవగణ్ పాత్ర ఎలా ఉంటుంది తారక్ ముస్లిం గానే కనిపిస్తారా లేదా అని అడగ్గా… నేను ట్రైలర్లోనే చెప్పాల్సిందందా చెప్పేశా అని చాలా క్లియర్గా చూపించా అని కానీ ఇంకా మీరు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏమిటి ఇది చూస్తుంటే స్క్రిప్ట్ మొత్తం మీకు చూపించమని అడుగుతున్నట్లు ఉంది అని నవ్వుతూ సరదాగా అన్నారట.దీంతో సమావేశం మొత్తం నవ్వులు పూశాయని తెలుస్తుంది.. దీంతో పాటు ఈ సినిమా మొత్తం పూర్తి కల్పితమని కేవలం భీమ్ మరియు రామ్ వ్యక్తిత్వాలను చూపించేందుకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారని సమాచారం.హిస్టరీ చూపించడం తమ ఉద్దేశం కాదని అన్నారట దర్శకుడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: