హిట్ కొట్టాడో లేదో.. అప్పుడే మల్టీ స్టారర్ అంటున్న డైరెక్టర్!!

P.Nishanth Kumar
బొమ్మరిల్లు సినిమా తో టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా స్థిరపడి పోయాడు భాస్కర్. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సృష్టించుకున్నాడు. బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా అంతటి స్థాయిలో విజయం దక్కించుకోలేదు దాంతో ఆయన చాలా రోజుల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్ కి తొలి హిట్ అందించిన ఘనత బొమ్మరిల్లు భాస్కర్ కొట్టేసాడు. దీంతో ఆయనకు తెలుగులో మళ్లీ అవకాశాలు రావడం గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు.  అయితే ఇప్పుడు ఆయన తదుపరి సినిమా ఏమై ఉంటుందా అని అందరూ తెగ ఎదురు చూస్తుండగా ఈ డైరెక్టర్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పెద్ద హీరోలతోనే మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

గతంలో ఆయన దర్శకత్వం లో వచ్చిన ఒంగోలు గిత్త సినిమా తర్వాత కూడా ఆయన ఈ విధంగా ముగ్గురు హీరో లతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని చూశాడు. కానీ అది ఆగిపోయింది. ఇప్పుడు హిట్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ తరహా లో సినిమాను మళ్ళీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు అంటున్నారు. తమిళంలో నాటికల్ అనే సినిమాలో ముగ్గురు హీరో లతో చేయగా అదే సినిమా ను మలయాళంలో బెంగళూరు డేస్ గా చేశారు. వీటిలో ముగ్గురు హీరో లు నటించారు. అప్పట్లో ఇదే సినిమాని తెలుగులో ఎన్టీఆర్, నాగ చైతన్య, రామ్ చరణ్ లతో చేయాలని భాస్కర్ ప్రయత్నాలు చేయగా కొన్ని కారణాల చేత ఈ సినిమా వర్కవుట్ కాలేదు.  అయితే తాజాగా మరో యాక్షన్ స్టోరీతో బొమ్మరిల్లు భాస్కర్ మాస్ మసాలా యాక్షన్ చిత్రం చేయబోతున్నారట. మరి కుటుంబ కథా చిత్రాలను బాగా చేస్తాడు అనే పేరున్న భాస్కర్ ఈ యాక్షన్ చిత్రాన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: