సాయిబాబా భక్తులను నిరాశపరిచిన "శిరిడి సాయి"
భక్తి కథ చిత్రం అంటే నాగ్, రాఘవేంద్ర రావు కాంబోకి పెట్టింది పేరు. అలాంటిది ఈ చిత్రం కాస్త ఆ తరహా ఔట్ ఫుట్ ను పొందలేదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. భక్తి బయోపిక్ తరహాలో ఈ నిజ జీవిత కథను రూపుదిద్దినట్లు కాకుండా రెగ్యులర్ కమర్షియల్ తరహాలో కామెడీ, విలన్ అలా పరుచూరి వారి స్క్రిప్టుతో వెండి తెరపై మెరిసిన ఈ చిత్రం సాయి భక్తులని మెప్పించలేకపోయింది. బాబా బయోపిక్ చూడాలని థియేటర్ కు వెళ్ళిన వారికి నిరాశే మిగిలింది. నటీనటుల్లో దాసగణు (శ్రీకాంత్), నానావళి (సాయికుమార్), మహల్సాపతి (శరత్బాబు), వేల్స్ (శ్రీహరి), వంటి పాత్రలు బాగానే రక్తి కట్టించాయి. రాధాభాయిగా కమలిని ముఖర్జీ నటన ప్రేక్షకులకు పెద్దగా చేరలేదు.
వ్యాపారాత్మక చిత్రాలు తీయడం ఒక ఎత్తు అయితే, భక్తినిగొల్పే చిత్రాలు రూపొందించడం మరొక ఎత్తు ఇవి పూర్తిగా భిన్నం. భక్తి తరహాలో చిత్రాలను రూపొందించడంలో ప్రముఖుడు కె. రాఘవేంద్రరావు. భక్తిని, రక్తిని చక్కగా బ్యాలెన్స్ చేసే ఆయన గతంలో అన్నమయ్య మరియు శ్రీరామదాసు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నాగ్ తో తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు. ఈసారి ఈ సినిమాలో పెద్దగా భక్తుల అంచనాలకు రీచ్ అవలేకపోయారు.