కోన వెంకట్ కొంపముంచిన గల్లీ రౌడీ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా రచయితగా నిర్మాతగా కోన వెంకట్ ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకును ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద సినిమాలను నిర్మించే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. ఇటీవలే ఆయన సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా ఫ్లాప్ కావడంతో ఈ ఎఫెక్ట్ తన తదుపరి ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది.

కోన వెంకట్ ఆ మధ్య ఆయన ఓ ఆలిండియా సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.  ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన కరణం మల్లేశ్వరి బయోపిక్ చేయాలని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు వివరాలు తెలుపుతూ ఆయన అధికారికంగా ఈ ప్రకటన చేయగా ఎందరికో స్ఫూర్తిని రగిలించే కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసి ఆమె కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎం వీ వీ సత్యనారాయణ తో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన ప్లాన్ చేశారు. 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అని కూడా అనుకున్నా.రు అతి త్వరలో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులకు ఎన్నో ఆశలు కలిగించిన సమయంలో ఈ ప్రాజెక్టు ను ఆపేసినట్లు మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దానికి కారణం తలైవి పేరుతో జయలలిత బయోపిక్ సినిమా రావడం అది భారీ డిజాస్టర్ గా మారడమే ఈ బయోపిక్ ఆగిపోవడానికి కారణం అంటున్నారు. ఎంతో గ్లామర్ ఉన్న ఆ సినిమా నే పట్టించుకోని ప్రేక్షకులు కరణం మల్లేశ్వరి బయోపిక్ ను ఆదరిస్తారా లేదా అనే సందేహం రావడంతో వారు ఈ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ సినిమా ఫ్లాప్ అవడం కూడా ఈ సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: