మహా సముద్రం.. థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్..!

Divya
నాటి కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగిన విషయం తెలిసిందే .. కానీ ఈ మధ్య కాలంలో రీమేక్ లతో వచ్చి, చాలా మంది హీరోలు మల్టీస్టారర్ గా తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి - రామ్ చరణ్ ఆచార్య సినిమాలో , పవన్ కళ్యాణ్ - దగ్గుపాటి రానా భీమ్లా నాయక్ సినిమాలో, వెంకటేష్ - వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాలను మల్టీ స్టారర్ మూవీలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరోలలో గుర్తింపుపొందిన శర్వానంద్ అలాగే సిద్ధార్థ కలిసి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం మహా సముద్రం. ఇక ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.. ఇకపోతే ఈ సినిమాని వచ్చే నెల అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు చిత్రం యూనిట్ సభ్యులు.
ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా ఎప్పుడు విడుదల చేస్తామనే  విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.. ఇక ఈనెల అనగా సెప్టెంబర్ 23 వ తేదీ గురువారం రోజున ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తామని, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు చిత్రం యూనిట్ సభ్యులు. ఈ సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించగా, ఇక యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్లుగా అను ఇమ్మాన్యుయేల్ తో పాటు అదితీరావ్ కూడా నటిస్తోంది.. ఇక ఈ సినిమాలో రావు రమేష్ , జగపతి బాబు వంటి పలువురు ప్రముఖులు కూడా నటిస్తున్నారు.. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: