హీరోలు ఓ స్టేటస్ అనుభవిస్తున్నారంటే దానికి కారణం వారి కష్టంతో పాటు అభిమానించేవారు ఉండటమే. తమకు వినోదాన్ని అందిస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో నచ్చిన హీరోలను ఎంతగానో అభిమానిస్తుంటారు. ఎవరైనా తమ అభిమాన హీరోలను మాటలు అంటే అస్సలు ఊరుకోరు...మా హీరోను అంటావా అంటూ గొడవకు దిగుతుంటారు. ఇక సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తమ హీరో సినిమానే ట్రెండింగ్ లో ఉండాలని అనుకుంటారు. వరుస పోస్టులు చేస్తూ తతమ హీరో సినిమాను హీరో పేరును ట్రెండింగ్ లోకి తీసుకువస్తుంటారు. అయితే అలాంటి అభిమానుల కోసం హీరోలు కూడా ఎంతో కొంత చేయాలి.
ముఖ్యంగా అభిమానులకు కష్టం వచ్చినప్పుడు అండగా ఉండాలి. అలా అభిమానులకు అవసరం వచ్చినప్పుడు సహాయ పడటంలో మన తెలుగు హీరోలు మందు వరుసలో ఉంటారు. ఎంతటి స్టార్ హీరోగా ఎదిగినా స్టేజ్ పైకి రాగానే ముందుగానే ముందుగా అభిమానులను పలకరిస్తుంటారు. ఇక అనారోగ్యంతో ఉన్న అభిమానులు తమ హీరో పలకరిస్తే చాలానుకుంటారు. తాజాగా అలాగే క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రభాస్ అభిమాని అతడిని చూడాలని కోరుతకుంది.
శోబితా అనే ప్రభాస్ అభిమాని పాన్ ఇండిమా స్టార్ ను చూడాలని కోరుకోవడంతో ఆమె కోరికను తీర్చాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న ప్రభాస్ శోబితాకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. దాంతో శోబితా ఎంతో ఆనందపడింది. తన కోసం ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ ఫోన్ చేశాడని శోబితా కుషీ అయ్యింది. ఇక ప్రభాస్ క్యాన్సర్ తో పోరాడుతున్న శోబితకు ఎంతో ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆది పురుష్ అనే రెండు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.